దూదిలాంటి ఇడ్లీల కోసం
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:42 AM
అందరూ ఇష్టపడేలా ఇడ్లీ మెత్తగా దూదిలా రావడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరి...
అందరూ ఇష్టపడేలా ఇడ్లీ మెత్తగా దూదిలా రావడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరి...
ఒక కప్పు మినపగుండ్లకు రెండున్నర కప్పుల ఇడ్లీరవ్వ లేదా రెండు కప్పుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకోవాలి.
ఉప్పుడు బియ్యం లేదా ఇడ్లీ రవ్వను నాలుగు గంటలు, మినపగుండ్లను రెండు గంటలు నానబెట్టాలి. అంతకంటే ఎక్కువ సమయం వాటిని నాననిస్తే అనుకున్నవిధంగా ఇడ్లీలు రావు.
మినపగుండ్లను నానబెట్టేటపుడు అందులో కొన్ని మెంతులు కూడా వేయాలి.
ఉప్పుడు బియ్యాన్ని కాస్త బరకగా గ్రైండ్ చేయాలి.
నానిన మినపగుండ్లను గ్రైండర్లో వేసేటప్పుడు చల్లటి నీళ్లు పోస్తే పిండి వేడెక్కకుండా మెత్తగా నురుగులా వస్తుంది. దీనిలో ఇడ్లీ రవ్వ వేసి చేత్తో కలిపితే పిండి బాగా పొంగి ఇడ్లీలు మెత్తగా వస్తాయి.
కొన్ని అటుకులను అరగంటసేపు నీళ్లలో నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి పిండిలో కలిపితే ఇడ్లీలు మృదువుగా రుచిగా తయారవుతాయి.
పిండిలో అయొడిన్ లేని రాతి ఉప్పును కలపడంవల్ల ఇడ్లీలు రుచిగా మృదువుగా వస్తాయి.
ఇడ్లీలు వేసేటప్పుడు పిండిని ఎక్కువగా కలపకూడదు. అలా కలిపితే ఇడ్లీలు పొంగడానికి అవసరమైన గాలి బుడగలు మాయమవుతాయి.
ఇడ్లీలను పది నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించకూడదు. స్టవ్ మీద నుంచి ఇడ్లీ కుక్కర్ను దించిన మూడు నిమిషాల తరువాతనే ఇడ్లీలను రేకులనుంచి పళ్లెంలోకి తీయాలి.
ఈ వార్తలనూ చదవండి:
సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్ఎం కాంట్రవర్సీపై సీబీఎస్ఈ స్పందన
యూపీలో ఎన్కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి