ఇలా చేస్తే మొటిమలు మాయం
ABN , Publish Date - May 18 , 2026 | 05:11 AM
ముఖంపై వచ్చే మొటిమలను గిల్లకుండా చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు..
ముఖంపై వచ్చే మొటిమలను గిల్లకుండా చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు..
ఒక్కోసారి మొటిమలు పెద్ద దద్దుర్ల మాదిరి వచ్చి నొప్పిగా అనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఐస్క్యూబ్స్తో వాటిమీద అద్దితే ఉపశనమనంగా ఉంటుంది. వాపు కూడా తగ్గుతుంది.
చిన్న గిన్నెలో చెంచా పసుపు, అర చెంచా తేనె వేసి కలిపి పేస్టులా చేయాలి. దీన్ని మొటిమలపైన చిన్న చుక్కలా ఉంచి అరగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. మూడు రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి.
వేపాకులను శుభ్రంగా కడిగి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్లా అప్లయ్ చేసి అరగంట తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే మొటిమల సమస్య తీరుతుంది.
మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే... ఒక గిన్నెలో రెండు చెంచాల ముల్తానీమట్టిని తీసుకుని అందులో తగినన్ని గులాబీ నీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి బాగా ఆరిన తరువాత మంచినీళ్లతో శుభ్రంచేసుకుంటే మొటిమలు, వాటివల్ల ఏర్పడే మచ్చలు తగ్గుతాయి.
రాత్రి పడుకునేముందు మొటిమలపైన కలబంద గుజ్జు రాసి ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
చెంచా కొబ్బరి నూనెలో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి మొటిమలపైన రాస్తే నొప్పి, వాపు తగ్గుతాయి.
ముఖానికి తరచూ తేనె లేదా గ్రీన్ టీ డికాషన్ అప్లయ్ చేసుకుంటూ ఉంటే చర్మంపై సెబమ్ ఉత్పత్తి తగ్గి ప్రయోజనం కనిపిస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్, మంచి నీళ్లను సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
ఈ వార్తలనూ చదవండి:
ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్ కంపెనీగా టీసీఎస్
బంగారంలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్, ఈజీఆర్లు