విజయ్ పర్యటనలను నిమంత్రించలేం: సుప్రీం
ABN , Publish Date - Jul 08 , 2026 | 07:02 AM
కరూర్ తొక్కిసలాట వ్యవహారంపై తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది....
చెన్నై, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కరూర్ తొక్కిసలాట వ్యవహారంపై తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సీఎం విజయ్ పర్యటనలు, ప్రసంగాలపై ఆంక్షలు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మంగళవారం స్పందించిన ధర్మాసనం డీఎంకే తీరుని తప్పుబట్టింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో సీఎం విజయ్ నిందితుడు కాదని, ఆయన పర్యటనలను నియంత్రించే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. రాజకీయ విభేదాలను పరిష్కరించుకోడానికి సుప్రీంకోర్టును వేదికగా చేసుకోవద్దని సూచించింది. పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం
రూ.15 విలువైన ఆర్డర్కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్