రీల్స్, పకోడీలకే యువత పరిమితం కావాలని..
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:33 AM
‘‘మన దేశ యువత ప్రశ్నించకుండా, కళ్లు తెరిచి నిజాలు చూడ కుండా.. రీల్స్ చేసుకుంటూ, పకోడీలు వేపుకుంటూ ఉండిపోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు’’ అని కాంగ్రెస్ అగ్రనేత...
ప్రధాని కోరుకుంటున్నారు: రాహుల్
న్యూఢిల్లీ, జూన్ 7: ‘‘మన దేశ యువత ప్రశ్నించకుండా, కళ్లు తెరిచి నిజాలు చూడ కుండా.. రీల్స్ చేసుకుంటూ, పకోడీలు వేపుకుంటూ ఉండిపోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సీబీఎ్సఈ ఆన్స్కీన్ మూల్యాంకనం (ఓఎ్సఎమ్) విధానంలో జరిగిన అక్రమాలను ఎత్తిచూపిన 18 ఏళ్ల విద్యార్థి సార్థక్ సిద్ధాంత్, ఎఽథికల్ హ్యాకర్ నిసర్గలను ఆదివారం ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. సార్థక్ సిద్ధాంత్తో తాను భేటీ అయిన వీడియోను ఎక్స్ పంచుకుంటూ.. ఇది ప్రభుత్వంపై యువత సాధించిన విజయమని పేర్కొన్నారు. దేశంలో మీడియాసంస్థలు, దర్యాప్తు ఏజెన్సీలు కూడా చేయలేని పనిని, ఈ ఇద్దరు యువకులు చేసి చూపించారని కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News