Share News

రూ. 60 వేల కోట్లతో దేశవ్యాప్తంగా పీఎంసేతు అమలు

ABN , Publish Date - Jul 08 , 2026 | 06:39 AM

దేశవ్యాప్తంగా 60 వేల కోట్ల రూపాయలతో ప్రధాన్‌ మంత్రి స్కీలింగ్‌ అండ్‌ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ త్రూ అప్‌గ్రేడేడ్‌ ఐటీఐస్‌ (పీఎం సేతు)ను...

రూ. 60 వేల కోట్లతో దేశవ్యాప్తంగా పీఎంసేతు అమలు

  • 1,237 కోట్లతో ఐటీఐల అభివృద్ధి

న్యూఢిల్లీ, జూలై 7: దేశవ్యాప్తంగా 60 వేల కోట్ల రూపాయలతో ప్రధాన్‌ మంత్రి స్కీలింగ్‌ అండ్‌ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ త్రూ అప్‌గ్రేడేడ్‌ ఐటీఐస్‌ (పీఎం సేతు)ను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ. 1,237 కోట్లతో 200 ఐటీఐ క్లస్టర్లలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ పీఎంసేతు పథకాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధమయింది. స్కీల్‌ డెవల్‌పమెంట్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆధ్వర్యంలో నేషనల్‌ స్టీరింగ్‌ కమిటీ (ఎన్‌ఎ్‌ససీ) ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పథకంలో భాగంగా ఒడిశాకు చెందిన జిందాల్‌ నవీన్‌ అవసర్‌ లిమిటెడ్‌, గుజరాత్‌కు చెందిన ఆర్సెల్లార్‌ మిత్త్తల్‌-నిప్పన్‌ స్టీల్‌తోపాటు తెలంగాణకు చెందిన రెండు పరిశ్రమలు కూడా భాగాస్వామ్యులుగా ఉండబోతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

Updated Date - Jul 08 , 2026 | 06:39 AM