నేటి నుంచి భారత్ అమెరికా వాణిజ్య చర్చలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 07:04 AM
నేటి నుంచి భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు...
న్యూఢిల్లీ, వాషింగ్టన్, ఏప్రిల్ 19: నేటి నుంచి భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ చర్చల్లో పాల్గొనేందుకు భారత ప్రతినిధుల బృందం వాషింగ్టన్ చేరుకుంది. రెండు దేశాల మధ్య గతంలోనే వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైనా అమెరికా అధ్యక్షుడు విధించిన టారి్ఫలపై ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాజా చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత బృందానికి వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పన్ జైన్ నేతృత్వం వహిస్తున్నారు. కస్టమ్స్, విదేశాంగ శాఖ అధికారులు కూడా భారత ప్రతినిధి బృందంలో ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్గా మారిన ఆడియో