51వేల కోట్లతో కొత్తగా 62 రవాణా నౌకలు
ABN , Publish Date - May 02 , 2026 | 06:04 AM
భారీ పెట్టుబడులతో నౌకారంగాన్ని శక్తివంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు రూ.51,383 కోట్లతో...
న్యూఢిల్లీ, మే 1: భారీ పెట్టుబడులతో నౌకారంగాన్ని శక్తివంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు రూ.51,383 కోట్లతో కొత్తగా 62 రవాణా నౌకలను సమకూర్చుకోనుంది. కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన మంత్రిత్వశాఖల సబ్కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితిని, దానివల్ల సముద్ర వాణిజ్య రవాణా మార్గాల్లో తలెత్తుతున్న ప్రతిబంధకాలను సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో దీర్ఘకాలిక అవసరాల రీత్యా రవాణానౌకల సంఖ్యను పెంచుకోవాలని నిర్ణయించారు. తద్వారా ఈ రంగం (షిప్పింగ్ ఫ్లీట్) సామర్థ్యాన్ని 2.85 మిలియన్ గ్రాస్ టన్నేజ్కు (జీటీ) పెంచవచ్చునని అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్ను తోసిపుచ్చిన ఈసీ