చెన్నై కోసం డీఎంకే ప్రత్యేక మేనిఫెస్టో
ABN , Publish Date - Apr 20 , 2026 | 07:29 AM
తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజధాని నగరం చెన్నై కోసం అధికార డీఎంకే ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. ‘సూపర్ సిక్స్’ పేరుతో తయారు చేసిన...
చెన్నై, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజధాని నగరం చెన్నై కోసం అధికార డీఎంకే ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. ‘సూపర్ సిక్స్’ పేరుతో తయారు చేసిన ఈ మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్, సీఎం స్టాలిన్ ఆదివారం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
తాగునీటి కనెక్షన్లు లేని ప్రాంతాల్లో ఆర్వో వాటర్, మెట్రో వాటర్ కనెక్షన్లు ఉన్న అపార్టుమెంట్లకు అంతరాయం లేకుండా నీటి సరఫరా
నగరంలోని ప్రతి వీధిని బస్స్టాపులు, మెట్రో, సబర్బన్ రైల్వే స్టేషన్లతో అనుసంధానించేందుకు కొత్తగా వెయ్యి మినీ బస్సులు, ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకు వీలుగా కృత్రిమేథ(ఏఐ) ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ
ఎన్నూరు నుంచి పూంజేరి వరకు చెన్నై సరిహద్దు రహదారి (చెన్నై బోర్డర్ రోడ్) వంటి 10 ముఖ్య ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేయడం, 2028 నాటికి మెట్రో రైల్ విస్తరణ పనులు
2027 నాటికి భూగర్భ, మురుగు, వర్షపునీటి కాల్వల నిర్మాణం పూర్తి
రూ.10 వేల కోట్లతో ఏఐ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, ఇమ్మర్సిన్ టెక్నాలజీల కోసం గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్గా మారిన ఆడియో