కాంగ్రెస్ పక్కన కూర్చోలేం..సీట్లు మార్చండి
ABN , Publish Date - May 09 , 2026 | 05:26 AM
లోక్సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల పక్కన ఇక కూర్చోబోమని డీఎంకే స్పష్టం చేసింది. సభలో తమ సభ్యుల సీట్లు మార్చాలని...
లోక్సభ స్పీకర్కు డీఎంకే నేత కనిమొళి లేఖ
హస్తం పార్టీతో పొత్తుకు స్వస్తి చెప్పినట్లు వెల్లడి
చెన్నై, మే 8 (ఆంధ్రజ్యోతి): లోక్సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల పక్కన ఇక కూర్చోబోమని డీఎంకే స్పష్టం చేసింది. సభలో తమ సభ్యుల సీట్లు మార్చాలని కోరుతూ స్పీకర్ ఓ బిర్లాకు ఆ పార్టీ లేఖ రాసింది. హస్తం పార్టీతో పొత్తుకు స్వస్తి చెప్పినట్లు ఆ లేఖలో స్పష్టం చేసింది. తమ మధ్య పొత్తు ముగిసినందున ఇకపై కలసి కూర్చోవడం సమంజసం కాదని అభిప్రాయపడింది. తమిళనాడులో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు అవసరమని స్పీకర్కు రాసిన లేఖలో డీఎంకే నేత కనిమొళి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
దేశంలో తొలి స్పేస్ టెక్ యూనికార్న్గా స్కైరూట్