తమిళనాడు ఎన్నికల పరిశీలకులుగా మధుయాష్కీ , పల్లంరాజు
ABN , Publish Date - Apr 05 , 2026 | 07:01 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. మొత్తం...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. మొత్తం 27మంది నేతలను పార్టీ తరఫున ఎన్నికల పరిశీలకులుగా నియమిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగురాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్కు పరిశీలకుల జాబితాలో స్థానం దక్కింది. ఎంపీ ప్రణతి షిండే, అనిల్యాదవ్, రామలింగారెడ్డి తదితరులు పరిశీలకులుగా నియమితులయ్యారు.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు