Share News

దిశా శాలియన్ కేసు.. ఎఫ్ఐఆర్‌లో తన పేరుపై స్పందించిన ఆదిత్య ఠాక్రే

ABN , Publish Date - Sep 16 , 2026 | 09:26 PM

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో తన పేరు పేర్కొనడంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే స్పందించారు.

దిశా శాలియన్ కేసు.. ఎఫ్ఐఆర్‌లో తన పేరుపై స్పందించిన ఆదిత్య ఠాక్రే
Aditya Thackeray on Disha Salian Case

ఇంటర్నెట్ డెస్క్: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో తన పేరు పేర్కొనడంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే స్పందించారు. దిశా శాలియన్ ఏనాడూ కలవలేదని చెప్పారు. తన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ పరిణామం వెనుక రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయని అన్నారు.

‘టీవీలో చర్చలు, డిబేట్లు వాస్తవాలను మార్చలేవు. ఈ కేసులో మళ్లీ జరుగుతున్న విచారణ వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు ఉండకూడదని ఆశిస్తున్నా. నిజం కోసం నేను పోరాడుతూనే ఉంటాను. ఎవరూ అడ్డుకోలేరు’ అని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు.


బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసులో సెప్టెంబర్ 13న ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దిశా శాలియన్ తండ్రి సతీష్ శాలియన్ ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. నేరాన్ని దాచి పెట్టేందుకు కుట్ర జరిగిందని సీబీఐ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారుల పాత్రపై విచారణ జరగాలని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. నిందితులకు రక్షణగా పోలీసు యంత్రాంగాన్ని వినియోగించారని కూడా సీబీఐ ఆరోపించింది.

దిశా శాలియన్ కొంతకాలం నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌కు మేనేజర్‌గా వ్యవహరించింది. 2020 జూన్ 9న ఆమె ఓ భవనం 12వ అంతస్తు నుంచి పడిపోయి మృతి చెందింది.


ఈ వార్తలనూ చదవండి:

‘మోదీజీ.. యూపీఐ పన్నును వెనక్కి తీసుకోండి’: రాహుల్‌ గాంధీ

షహజాద్ భట్టి నెట్‌వర్క్‌‌ను ఉగ్రవాద సంస్థగా కేంద్రం ప్రకటన

Updated Date - Sep 16 , 2026 | 09:33 PM