Share News

ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజ్.. ‘కోస్టల్ కర్ణాటక’ టూర్ వివరాలు ఇవే

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:06 PM

ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు సముద్ర తీర అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ‘కోస్టల్ కర్ణాటక’ టూర్ ప్యాకేజ్‌ను అందిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ 5 రాత్రులు–6 రోజుల యాత్రలో ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజ్.. ‘కోస్టల్ కర్ణాటక’ టూర్ వివరాలు ఇవే
IRCTC Coastal Karnataka Tour Package

ఇంటర్నెట్ డెస్క్: ఆధ్యాత్మిక యాత్రతో పాటు సముద్ర తీరాల అందాలు, ప్రకృతి సోయగాలను ఒకే ట్రిప్‌లో ఆస్వాదించాలని భావిస్తున్న వారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీని అందిస్తోంది. 'కోస్టల్ కర్ణాటక' పేరుతో రూపొందించిన ఈ 5 రాత్రులు–6 రోజుల టూర్‌లో ఉడుపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ, హొరనాడు, శృంగేరి, మంగళూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం ఈ యాత్ర ప్రారంభమవుతుంది.


ప్యాకేజ్ వివరాలు

  • ప్యాకేజ్ పేరు: కోస్టల్ కర్ణాటక

  • ప్యాకేజ్ కోడ్: SHR085

  • ప్రారంభ కేంద్రం: కాచిగూడ రైల్వే స్టేషన్, హైదరాబాద్

  • ప్రయాణ విధానం: రైలు

  • రైలు నంబర్: కాచిగూడ–మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (12789/12790)

  • ప్రయాణ ప్రారంభ సమయం: ఉదయం 6:05 గంటలు

  • టూర్ : ప్రతి మంగళవారం

  • తరగతులు: స్లీపర్ (Standard), 3AC (Comfort)


6 రోజుల టూర్

మొదటి రోజు: ప్రతి మంగళవారం ఉదయం కాచిగూడ నుంచి రైలులో ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.

రెండో రోజు: ఉదయం మంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఉడుపికి వెళ్తారు. హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత శ్రీకృష్ణ ఆలయం, మల్పే బీచ్‌ను సందర్శిస్తారు. రాత్రికి ఉడుపిలో బస ఉంటుంది.

మూడో రోజు: ఉదయం కొల్లూరులోని శ్రీ మూకాంబికా ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం మురుడేశ్వర్‌లోని ప్రసిద్ధ శివాలయం, భారీ శివుని విగ్రహాన్ని వీక్షిస్తారు. ఆ తర్వాత గోకర్ణ మహాబలేశ్వర ఆలయం, సముద్రతీరాన్ని సందర్శించి తిరిగి ఉడుపికి చేరుకుంటారు.

నాలుగో రోజు: హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసిన తర్వాత హొరనాడు లోని అన్నపూర్ణేశ్వరి ఆలయం, అనంతరం శృంగేరిలోని శారదాంబ ఆలయాన్ని దర్శించి సాయంత్రానికి మంగళూరుకు చేరుకుంటారు. అక్కడే రాత్రి బస ఉంటుంది.

ఐదో రోజు: మంగళూరు నగరంలోని మంగళాదేవి ఆలయం, కద్రి మంజునాథ ఆలయం, కుద్రోలి గోకర్ణనాథ ఆలయం, తన్నీర్భవి బీచ్ వంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తారు. సాయంత్రం మంగళూరు సెంట్రల్ స్టేషన్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

ఆరవ రోజు: రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.


ప్యాకేజ్ ధరలు

3AC

  • సింగిల్ షేరింగ్ – ₹41,630

  • ట్విన్ షేరింగ్ – ₹23,670

  • ట్రిపుల్ షేరింగ్ – ₹19,000

స్లీపర్

  • సింగిల్ షేరింగ్ – ₹38,600

  • ట్విన్ షేరింగ్ – ₹20,650

  • ట్రిపుల్ షేరింగ్ – ₹15,970

నాలుగు నుంచి ఆరు మంది కలిసి బుకింగ్ చేసుకుంటే మరింత తక్కువ ధరల్లో ఈ ప్యాకేజీ లభిస్తుంది.

ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు

  • స్లీపర్ లేదా 3AC రైలు ప్రయాణం

  • స్థానికంగా ఏసీ వాహనంలో రవాణా

  • మూడు రాత్రుల హోటల్ వసతి

  • మూడు రోజుల అల్పాహారం

  • షెడ్యూల్ ప్రకారం పూర్తిగా సైట్‌సీయింగ్

  • ట్రావెల్ ఇన్సూరెన్స్

  • టోల్, పార్కింగ్, జీఎస్‌టితో సహా ఇతర పన్నులు


ప్యాకేజీలో లేని సేవలు

  • మధ్యాహ్న, రాత్రి భోజనం

  • రైలులో ఆహారం

  • ఆలయ ప్రత్యేక దర్శన టికెట్లు, ప్రవేశ రుసుములు

  • బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి వినోద కార్యక్రమాలు

  • టూర్ గైడ్ సేవలు

  • వ్యక్తిగత ఖర్చులు, ఇతర అదనపు సేవలు

హోటల్ వసతి

  • ఉడుపి: వైట్ లోటస్ లేదా సమాన స్థాయి హోటల్

  • మంగళూరు: జింగర్ హోటల్ లేదా సమాన స్థాయి హోటల్

ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనం, కర్ణాటక తీర ప్రాంతంలోని అందమైన బీచ్‌లు, ప్రకృతి సోయగాలు, చారిత్రక ప్రదేశాలను ఒకే యాత్రలో చూడాలనుకునే వారికి ఈ ఐఆర్‌సీటీసీ కోస్టల్ కర్ణాటక ప్యాకేజ్ మంచి ఎంపిక. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సౌకర్యం ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సౌకర్యవంతంగా ఈ యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Updated Date - Aug 05 , 2026 | 04:06 PM