చాణక్య నీతి.. ఇలా చేస్తే ఎవరూ మిమ్మల్ని మోసం చేయలేరు!
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:52 PM
ఈ రోజుల్లో ఎవరు నిజాయతీగా ఉన్నారు, ఎవరు నటిస్తున్నారనేది గుర్తించడం కష్టం. అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలను పాటిస్తే, ఒకరి నిజమైన స్వభావాన్ని సులభంగా గుర్తించవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో ఎవరు నిజాయతీగా ఉన్నారు, ఎవరు నటిస్తున్నారనేది గుర్తించడం చాలా కష్టం. కొంతమంది మంచిగా ఉంటూనే మోసం చేయవచ్చు. అలాంటి వారిని ముందుగానే గుర్తించడానికి ఆచార్య చాణక్యుడు కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అతిగా పొగిడే వారితో జాగ్రత్త..
ఎవరైనా కారణం లేకుండా మిమ్మల్ని ఎక్కువగా పొగిడితే జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది తమ పని కోసం మాత్రమే ఇలా చేస్తారు. మీరు చెప్పే ప్రతిదానికి అంగీకరిస్తే, వారి ఉద్దేశ్యం మంచిది కాకపోవచ్చు.
స్వార్థం ఉన్నవారిని గుర్తించండి..
నిజమైన వ్యక్తి మీ కోసం అవసరమైతే సహాయం చేస్తాడు. కానీ స్వార్థపరుడు తన ప్రయోజనం మాత్రమే చూస్తాడు. కష్ట సమయంలో మీకు సాయం చేయకుండా దూరంగా ఉంటే.. అలాంటి వ్యక్తులను నమ్మకూడదు.
ఎలా మాట్లాడుతారో గమనించండి..
ఎవరైనా మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే, వారు మీ గురించి కూడా ఇతరుల ముందు చెడుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాంటి వారిని నమ్మడం మంచిది కాదు.
కళ్ళు, మాట్లాడే తీరు..
ఒక వ్యక్తి కళ్లు వారి మనసును తెలియజేస్తాయి. మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూడకుండా తప్పించుకుంటే.. వారు ఏదో దాచిపెడుతున్నారని అర్థం. అబద్ధం చెప్పే వ్యక్తి మాటల్లో, ప్రవర్తనలో అది కనిపిస్తుంది.
చాణక్యుడి ప్రకారం.. ఒక వ్యక్తి నిజ స్వభావాన్ని వారి మాటలు, ప్రవర్తన, కష్ట సమయంలో వారి సాయం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎవరినైనా నమ్మే ముందు వారి ప్రవర్తనను గమనించడం చాలా ముఖ్యం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News