దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..
ABN , Publish Date - Aug 11 , 2026 | 02:29 PM
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఇరాన్ కారణంగా గత ఐదు దశాబ్దాల్లో అమెరికాకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు పరిహారం చెల్లించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఇరాన్ కారణంగా గత ఐదు దశాబ్దాల్లో అమెరికాకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు పరిహారం చెల్లించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తామని ఆయన స్పష్టం చేశారు (Trump Iran war).
గత 50 సంవత్సరాలలో జరిగిన నష్టాలకు ఇరాన్ బాధ్యత వహించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇరాన్ కారణంగా సంభవించించిన మరణాలు, యుద్ధాలు, దాడులు, ఇతర నష్టాలకు పరిహారం చెల్లించాలని ట్రంప్ అన్నారు. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా నుంచి పరిహారం కోరింది. అమెరికా చేసిన సైనిక చర్యలకు పరిహారం చెల్లించాలని, తమపై విధించిన ఆంక్షలను తొలగించాలని కోరుతోంది. ఇక, శాంతి చర్చల్లో హోర్ముజ్ను తిరిగి తెరవడం కీలకంగా మారింది (US Iran tensions).
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ పలు షరతులు పెట్టింది (Trump Iran compensation). అమెరికా తన సైనిక చర్యలను నిలిపివేయడం, ఆంక్షలను ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించడం వంటి అంశాలను ఇరాన్ ప్రస్తావిస్తోంది. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ నుంచి పరిహారం కోరుతుండడం చర్చలను మరింత క్లిష్టంగా మార్చింది.
ఇవి కూడా చదవండి..
ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు