పీరియడ్స్ సమయంలో ఏం తినాలో తెలుసా?
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:21 PM
పీరియడ్స్ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకోవడం వల్ల నొప్పి, అలసట తగ్గి శరీరానికి శక్తి అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పీరియడ్స్ సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. అందువల్ల తీవ్రమైన కడుపు నొప్పి, అలసట, బలహీనత, చిరాకు వంటి సమస్యలు రావచ్చు. కొంతమందికి తలనొప్పి, వెన్నునొప్పి కూడా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన ఆహారం తీసుకుంటే నొప్పి తగ్గుతుంది, శరీరానికి శక్తి వస్తుంది.
తినాల్సిన ఆహార పదార్థాలు..
పీరియడ్స్ సమయంలో రక్తం కోల్పోతారు కాబట్టి, ఐరన్ ఫుడ్స్ తీసుకోవాలి. ఆకుకూరలు, బీట్రూట్, దానిమ్మ, పప్పులు వంటివి రక్తహీనత రాకుండా కాపాడతాయి.
అలాగే.. కాల్షియం, మెగ్నీషియం ఉన్న ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు, బాదం, నువ్వులు.. వంటివి కడుపు నొప్పి తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాకుండా అరటిపండ్లు, ఓట్స్ కూడా తీసుకోవడం మంచిది. ఇవి అలసటను తగ్గించి శరీరానికి శక్తినిస్తాయి.
శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా రోజంతా తగినంత నీరు తాగాలి. సూప్లు, ఇంట్లో తయారుచేసిన తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
తినకూడని ఆహార పదార్థాలు..
ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం
వేయించిన, కారంగా ఉండే పదార్థాలు
ఎక్కువ చక్కెర ఉన్న పదార్థాలు
ప్యాకెట్ స్నాక్స్, ప్రాసెస్ చేసిన ఆహారం
అదే పనిగా కాఫీ, టీ తాగకూడదు. శీతల పానీయాలు తీసుకోకూడదు.
పీరియడ్స్ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం తింటే నొప్పి తగ్గి, శరీరం బలంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో జంక్ ఫుడ్ను దూరంగా ఉంచి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News