మార్కెట్లను వణికించిన 'ట్రంప్' ప్రసంగం.. ఇరాన్ యుద్ధ సెగతో కుప్పకూలిన సూచీలు
ABN , Publish Date - Apr 02 , 2026 | 09:09 AM
యావత్ ప్రపంచం ఎంతో ఆశతో ఎదురు చూసిన ఇవాళ్టి 'ట్రంప్' ప్రసంగం మార్కెట్లను వణికించింది. ఇరాన్ యుద్ధ సెగతో సూచీలు కుప్పకూలిపోయాయి. ట్రంప్ ప్రకటనకు ముందు లాభాల్లో ఉన్న గిఫ్ట్ నిఫ్టీ సూచీ, వెనువెంటనే 340 పాయింట్ల మేర పతనమైంది.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 2: యావత్ ప్రపంచం ఎంతో ఆశతో ఎదురు చూసిన ఇవాళ్టి 'ట్రంప్' ప్రసంగం మార్కెట్లను వణికించింది. ఇరాన్ యుద్ధ సెగతో సూచీలు కుప్పకూలిపోయాయి. ట్రంప్ ప్రకటనకు ముందు లాభాల్లో ఉన్న గిఫ్ట్ నిఫ్టీ సూచీ, వెనువెంటనే 340 పాయింట్ల మేర పతనమైంది. దీంతో మన సెన్సెక్స్, నిఫ్టీలు నేడు భారీ గ్యాప్ డౌన్తో ప్రారంభం కానున్నాయి. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్న సంకేతాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.