ఎన్ఎస్ఈలో వాటా విక్రయంతో మళ్లీ లాభాల్లోకి
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:01 AM
ప్రభుత్వరంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో మళ్లీ లాభాల్లోకి...
ఓరియంటల్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో మళ్లీ లాభాల్లోకి వచ్చేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)లో తనకున్న వాటాలో కొంత వాటా విక్రయం దోహదపడనుంది. ఈ ఏడాదిలో కొంత లాభాన్ని ఆర్జించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని, ఎన్ఎస్ఈ ఐపీఓ ద్వారా వచ్చే సొమ్ము ను లాభంగా పరిగణిస్తామని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ జోషి తెలిపారు. ఇది కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా సంస్థకు అవసరమైన నగదు లభ్యతను సమకూర్చుతుందన్నారు. ఎన్ఎ్సఈ ఐపీఓలో భాగంగా 49.57 లక్షల షేర్లను విక్రయించనున్నామని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు
ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!