Share News

Stock Market Watch: ఆచితూచి అడుగేయండి..

ABN , Publish Date - Jan 05 , 2026 | 05:36 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లు నిలకడగా సాగుతున్నాయి. అయితే వెనిజువెలా ఉద్రిక్తత...

Stock Market Watch: ఆచితూచి అడుగేయండి..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లు నిలకడగా సాగుతున్నాయి. అయితే వెనిజువెలా ఉద్రిక్తత మినహా మిగిలిన ఘర్షణలు స్తబ్దుగా మారాయి. ఈ వారం మెటల్‌, పీఎ్‌సయూ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, కమోడిటీస్‌, ఆటో, ఎనర్జీ, మీడియా రంగ షేర్లు పటిష్ఠతను కనబరిచే అవకాశం ఉంది. అయితే ఇన్వెస్టర్లు ఆచితూచి షేర్లను ఎంపిక చేసుకోవటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

ఇండియన్‌ బ్యాంక్‌: జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత 15 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు ప్రస్తుతం జోరు ప్రదర్శిస్తోంది. చివరి ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో 12 శాతం మేర పెరిగింది. 10,20,50 మూవింగ్‌ యావరేజె్‌సను అధిగమించింది. గత శుక్రవారం రూ.861 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.850 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.925/940 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.840 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

పీఎ్‌ఫసీ: పదిహేను నెలల క్రితం జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరు దాదాపు 45 శాతం మేర పతనమైంది. ప్రస్తుతం టర్న్‌ అరౌండ్‌ అవుతోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, వాల్యూమ్‌ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.375 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.365 శ్రేణిలో ఎంటరై రూ.425 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.350.

హిందాల్కో: గత ఏడాది మే నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. దాదాపు 65 శాతం మేర రాబడిని అందించింది. నిఫ్టీతో పోల్చితే జోరును ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం రూ.925 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.920 శ్రేణిలో ప్రవేశించి రూ.965/980 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.900.


హిందుస్థాన్‌ జింక్‌: గత సెప్టెంబరు నుంచి ఈ షేరు 50 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. జీవితకాల గరిష్ఠం వైపు పరుగులు తీస్తోంది. గత శుక్రవారం రూ.628 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.601 వద్ద రూ.725 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.600.

ఐఆర్‌ఈడీఏ: గత ఏడాది జూలై నుంచి ఈ షేరు భారీగా పతనమవుతూ వస్తోంది. ఏకంగా 57 శాతం మేర క్షీణించింది. ప్రస్తుతం కీలకమైన మద్దతు స్థాయి రూ.130 వద్ద టర్న్‌ అరౌండ్‌ అయ్యింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, వాల్యూమ్‌ గణనీయంగా పెరుగుతోంది. గత శుక్రవారం రూ.146 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.140 ఎగువన ప్రవేశించి రూ.160 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.139.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు

For More TG News And Telugu News

Updated Date - Jan 05 , 2026 | 05:36 AM