మారుతి కార్ల ధరల పెంపు
ABN , Publish Date - May 22 , 2026 | 02:46 AM
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా.. కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నిరంతరం పెరుగుతున్న...
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా.. కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఉత్పత్తి వ్యయాల కారణంగా జూన్ నుంచి తమ అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.30,000 వరకు ధరలను పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొన్ని నెలలుగా వ్యయ నియంత్రణ చర్యలను అమలు చేస్తున్నప్పటికీ.. ముడి సరుకుల ధరలు, సరఫరా అంతరాయాలు, తయారీ ఖర్చులతో పాటు ద్రవ్యోల్బణం అధికమవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
ఇవి కూడా చదవండి...
దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ
కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్ సభ్యులు.. ఏసీ ఆగ్రహం
Read Latest AP News And Telugu News