Share News

వాహన విక్రయాల జోరు

ABN , Publish Date - Jul 16 , 2026 | 03:09 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ బలమైన వృద్ధిని నమోదు చేసింది. ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు..

వాహన విక్రయాల జోరు

క్యూ1లో 25.9% వృద్ధితో

12,73,811 యూనిట్లుగా నమోదు: సియామ్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ బలమైన వృద్ధిని నమోదు చేసింది. ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు (కంపెనీ నుంచి డీలర్లకు జరిగిన వాహన సరఫరాలు) 12,73,811 యూనిట్లకు చేరి చరిత్రలోనే అత్యధిక తొలి త్రైమాసిక స్థాయిని నమోదు చేశాయి. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 10,11,884 యూనిట్లతో పోలిస్తే 25.9 శాతం పెరిగినట్లు భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్‌) వెల్లడించింది. పశ్చిమాసియా సంక్షోభం, సరఫరా అంతరాయాలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ దేశీయంగా గిరాకీ బలంగా ఉండడమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని పేర్కొంది. సియామ్‌ డేటా ప్రకారం.. ఈ ఏప్రిల్‌-జూన్‌లో ద్విచక్ర వాహనాల టోకు అమ్మకాలు 20.3 శాతం వృద్ధితో 46,77,990 యూనిట్ల నుంచి 56,28,675 యూనిట్లకు పెరిగాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 29.7శాతం వృద్ధితో 2,14,339 యూనిట్ల రికార్డు స్థాయికి చేరాయి.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 03:09 AM