జియో క్రెడిట్లో బ్యాంక్ ఆఫ్ అమెరికాకు 49.9 శాతం వాటా
ABN , Publish Date - Aug 13 , 2026 | 05:13 AM
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్...
డీల్ విలువ రూ.18,268 కోట్లు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎ్ఫఎ్సఎల్) ప్రమోట్ చేసిన రుణ వితరణ (ఎన్బీఎ్ఫసీ) సంస్థ జియో క్రెడిట్ లిమిటెడ్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా (బోఫా) 49.9 శాతం వాటాను చేజిక్కించుకుంది. బోఫా ఈ వాటాలను రూ.18,268 కోట్ల (190 కోట్ల డాలర్లు)కు కొనుగోలు చేసింది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒక జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఫ్రిఫరెన్షియల్ ఇష్యూ, వారంట్ల జారీ ద్వారా బోఫా ఈ వాటాలను తీసుకోనుంది.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News