సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట
ABN , Publish Date - Jul 27 , 2026 | 07:27 PM
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. మాజీ సీఐ నాగరాజు కస్టడీ విచారణ అంశంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సవరించింది.
అమరావతి, జులై 27: గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. మాజీ సీఐ నాగరాజు కస్టడీ విచారణ అంశంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సవరించింది. కస్టడీ విచారణ నిబంధనలను రద్దు చేసింది. సిట్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు విజయవాడ ఆఫీస్లో నాగరాజును ప్రశ్నించనున్నారు.
ఇవి కూడా చదవండి
సాటి మనిషికి సాయం చేయాలనే తపన ఉండాలి: వరుణ్ ఆరోన్
కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని తప్పుబట్టిన మద్రాస్ హైకోర్టు