మద్దిలేటి స్వామి ఆలయాభివృద్ధికి విరాళం
ABN , Publish Date - May 31 , 2026 | 12:35 AM
మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ఓ భక్తుడు శనివారం రూ 1.40 లక్షల విరాళాన్ని అందజేశారని ఉప కమిషనర్, ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు.
బేతంచెర్ల, మే 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ఓ భక్తుడు శనివారం రూ 1.40 లక్షల విరాళాన్ని అందజేశారని ఉప కమిషనర్, ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. ఆళ్లగడ్డ మండలం బాచాపురం గ్రామానికి చెందిన గజ్జల మధుమోహన్రెడ్డి ఈ విరాళాన్ని తమ సిబ్బందికి అందజేశారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.