Share News

ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ డుమ్మా..

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:39 PM

అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది.

ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ డుమ్మా..
YSRCP Assembly Boycott

అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


అసెంబ్లీలో వైసీపీకి తగిన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆ పార్టీ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. అసెంబ్లీలో ప్రస్తుతం రెండు పక్షాలే ఉన్నాయని, మూడో పక్షం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.


Also Read:

టార్చ్‌లైట్లతో బెదిరించబోతే జనంపైకి దూసుకొచ్చిన ఏనుగు.. వీడియో వైరల్

తెలంగాణలో ఈ జలపాతం అందాలు చూస్తే మైమరచిపోవాల్సిందే.!

Updated Date - Aug 12 , 2026 | 02:00 PM