GOD: ఘనంగా లంకా దహనం
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:29 PM
డి.హీరేహాళ్ మండలం లోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వా మి ఉత్సవాల సందర్భం గా ఆదివారం రాత్రి లం కా దహనం కార్య్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
డి. హీరేహాళ్ (బొమ్మనహాళ్), మార్చి, 22(ఆంధ్రజ్యోతి): డి.హీరేహాళ్ మండలం లోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వా మి ఉత్సవాల సందర్భం గా ఆదివారం రాత్రి లం కా దహనం కార్య్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం గండా దీపాలు మోసి, సాయంత్రం వసం తోత్సవం, రాత్రి 7:30 గంటలకు లంకా దహనా న్ని ఘనంగా నిర్వహించా రు. రాత్రి 9 గంటలకు మహామంగళహారతి ఇ చ్చారు. గ్రామంలో శ్రీరామ చెక్క భజన నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
27న సీతారామాంజనేయస్వామి తిరుణాల
పుట్లూరు: మండలంలోని రంగమనా యునిపల్లి శివారులో వెలసిన సీతారామాంజనేయస్వామి ఆలయం వద్ద ఈ నెల 27న తిరుణాల జరగనున్నట్లు ఆదివారం గ్రామపెద్దలు తెలి పారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణోత్సం, రాతిదూలం లాగు డు పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల్లో గెలుపొందిన వృషభాలకు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. వాటితోపాటు ఆల యం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....