రాజ్యసభ ముందుకు అమరావతి బిల్లు.. మరికొద్దిసేపట్లో చర్చ..
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:30 PM
అమరావతికి చట్టబద్ధత బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: అమరావతికి చట్టబద్ధత బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై మధ్యాహ్నం ఒంటి గంట నుంచి చర్చ చేపట్టనున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. రెండు గంటలపాటు చర్చ జరుగుతుందని అన్నారు.
కాగా, అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న(బుధవారం) లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. ఈ రోజు (గురువారం) ఉదయం బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టారు.
ఇవి కూడా చదవండి
ఊటీ గార్డెన్లో సినిమా షూటింగ్ల నిషేధం
ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు