Mysuru Dasara 2025: మైసూర్లో ఘనంగా దసరా ఉత్సవాలు..
ABN, Publish Date - Oct 02 , 2025 | 06:57 PM
మైసూరులో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న దసరా ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా జనం వచ్చారు.
మైసూరులో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న దసరా ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా జనం వచ్చారు. ఉత్సవాల్లో జంబూ సవారీ, రాజ దర్బార్ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఉదయం వజ్రముష్టి కలగ, ఆయుధ పూజలు జరిగాయి. శుభ ధనుర్ లగ్న శుభ సమయంలో మధ్యాహ్నం 1 గంటల నుండి 1.18 గంటల వరకు కోటే ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో నంది జెండాను పూజించారు. ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్య ఊరేగింపును జెండా ఊపి ప్రారంభించారు.
ఇవి కూడా చూడండి
తిరుమలలో వైభవంగా శ్రీవారి చక్రస్నానం
Updated at - Oct 02 , 2025 | 06:58 PM