ఉరవకొండలో జగన్కు షాక్ ..
ABN, Publish Date - Jan 30 , 2025 | 11:38 AM
అనంతపురం జిల్లా: ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. మంత్రి పయ్యావుల కేశవ్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్సితులైన మైనారిటీ నేతలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
అనంతపురం జిల్లా: ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి బిగ్ షాక్ తగిలింది. పట్టణ మైనారిటీ విభాగం దాదాపు ఖాళీ అయింది. మంత్రి పయ్యావుల కేశవ్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్సితులైన వైఎస్సార్సీపీ మైనారిటీ నేతలు టీడీపీలో చేరారు. ఐదేళ్లుగా ఉన్న మంచి నీటి సమస్యను మంత్రి పయ్యావులు పరిష్కరించారు. అలాగే నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మైనారిటీ నేతల చేరికతో ఉరవకొండలో వైఎస్సార్సీపీ దాదాపు ఖాళీ అయింది.
ఈ వార్త కూడా చదవండి..
జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
టీడీపీలో చేరిన వారిలో మైనారిటీ నేతలు హోతూరు బోరుగుల భాష, హోతూరు సద్దామ్, జి.ఎం.ఎస్.షాకిర్, బొజ్జల్లి కుమారుడు యూసుఫ్, పామిడి సలీం , పామిడి తయ్యుబ్, పామిడి నిజాం, ముల్లా యునూస్, పామిడి పిట్టి నూర్, మద్దికెర అన్వర్ బాషా తదితరులు ఉన్నారు. వారికి మంత్రి పయ్యావుల కేశవ్ టీడీపీ కాండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వేములవాడలో బీభత్సం సృష్టించిన లారీ
మాఘమాసం వచ్చేసింది... శుభ ఘడియలు.. పెళ్లి సందడి..
ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 30 , 2025 | 11:39 AM