వైఎస్సార్సీపీ కొత్త గేమ్.. రంగంలోకి బాలయ్య..
ABN, Publish Date - Jan 23 , 2025 | 11:12 AM
తెలుగుదేశం హిందూరం నియోజవర్గం కంచుకోటను బద్దలుకొట్టి పాగా వేయాలన్న వైఎస్సార్సీపీ ప్లాన్ ఫలించడంలేదు. అక్కడ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత హరికృష్ణ, ప్రస్తుతం బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించారు.
హిందూపురం: ఇక్కడ టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టి పాగా వేయాలన్న వైఎస్సార్సీపీ ప్లాన్ ఫలించడంలేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను మార్చినా.. ఆదరించలేదు. ఇక్కడ ప్రజలపై తెలుగుదేశం చెరగని ముద్ర వేసింది. అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయింది. దీన్ని చెరిపివేయాలని ఫ్యాన్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడంలేదు. నేతల మధ్య విబేధాలు.. అనైక్యతే ఇందుకు కారణం. ఒకరికి సీటు ఇస్తే.. మరొకరు వ్యతిరేకంగా పని చేయడమే దెబ్బకొడుతోంది.
ఈ వార్త కూడా చదవండి..
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణం తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ నెగ్గారు. ఇక 2014, 2019, 2024లో బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం నియోజకవర్గంలో నెగ్గాలన్న ఫ్యాన్ పార్టీ ప్రయత్నాలు ఫలించలేదు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనంలోనూ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ గెలిచి సత్తా చాటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో ప్రతిసారి కొత్త అభ్యర్థిని బరిలో దింపినా ఫలితం దక్కలేదు. కులసమీకరణాల లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్తో గెలవాలని కుయుక్తులు పన్నినా ప్రయోజనం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ముందడుగు
టాలీవుడ్ నిర్మాతల ఆస్తులను పరిశీలిస్తున్నఐటీ
అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయండి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 23 , 2025 | 11:48 AM