చంద్రబాబుతో టీడీపీ నేతల గెలుపు సంబరాలు

ABN, Publish Date - Mar 04 , 2025 | 07:58 PM

ఎన్టీఆర్ భవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయోత్సవ సభ మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబుతోపాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కూటమిలోని పార్టీల కీలక నేతలు సైతం హాజరయ్యారు.

అమరావతి, మార్చి 04: ఎన్టీఆర్ భవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయోత్సవ సభ మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబుతోపాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కూటమిలోని పార్టీల కీలక నేతలు సైతం హాజరయ్యారు.

మరోవైపు తాజాగా జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బరిలో నిలిపిన ఇద్దరు అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. అంతేకాదు.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్ల షేర్ కంటే.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్లు షేర్ భారీగా పెరిగింది. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. గత ఎనిమిది నెలల చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనకు నిదర్శనంగా నిలిచింది. ఇంకోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించడంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 04 , 2025 | 07:58 PM