'స్వర్ణం కుప్పం విజన్ 2029' డాక్యుమెంట్ విడుదల
ABN, Publish Date - Jan 06 , 2025 | 01:11 PM
చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కుప్పం నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముందుగా కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీని ఆయన ఆవిష్కరించారు.
చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కుప్పం నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముందుగా కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా చార్జీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రెండు రోజులు (6, 7) పాటు కుప్పం నియోజకవర్గం (Kuppam Constituency)లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో (Development Programs)పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ మణికంఠ రెండు రోజులుగా కుప్పంలోనే ఉంటూ ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏసీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్..
ఫార్ములా-ఈ కారు రేసు కేసు.. ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్..
పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 06 , 2025 | 01:11 PM