ఐఏఎస్ రిజ్వీ పై మంత్రి జూపల్లి ఫిర్యాదు

ABN, Publish Date - Oct 23 , 2025 | 01:17 PM

తెలంగాణ ఆబ్కారీ శాఖలో అనుచిత ప్రవర్తన అంశం మంటలు రేపుతోంది. కీలకమైన ఎక్సైజ్ శాఖలో మంత్రి, ఉన్నతాధికారుల మధ్య వాతావరణం నివ్వురుగప్పిన నిప్పులా ఉంది.

తెలంగాణ ఆబ్కారీ శాఖలో అనుచిత ప్రవర్తన అంశం మంటలు రేపుతోంది. కీలకమైన ఎక్సైజ్ శాఖలో మంత్రి, ఉన్నతాధికారుల మధ్య వాతావరణం నివ్వురుగప్పిన నిప్పులా ఉంది. తాజాగా అవి ఒక్కసారిగా బయటకు వచ్చాయి. తాను ఇచ్చిన ఆదేశాలను ముఖ్య కార్యదర్శి రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పెడ చెవిన పెట్టారంటూ సీఎస్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీఆర్ఎస్ కోసం రిజ్వీ దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును ఆమోదించ వద్దంటూ సీఎస్‌కు మంత్రి లేఖ రాశారు. అంతేకాకుండా.. రిజ్వీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ లేఖలో సీఎస్‌కు జూపల్లి స్పష్టం చేశారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఐదేళ్లలో ఎన్డీయే చేయలేనిది..20 నెలల్లో చేసి చూపిస్తా

జర్నలిస్టుల స్థలాలు కాపాడిన హైడ్రా

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 23 , 2025 | 01:22 PM