పోలీసులకు వ్యతిరేకంగా లాయర్ల నిరసన

ABN, Publish Date - Jan 10 , 2025 | 01:35 PM

గుంటూరు జిల్లా: కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు. కోర్టు ప్రాంగణంలోని ప్రధాన గేట్లు మూసివేసి నిరసనకు దిగారు. కొద్ది రోజుల క్రితం పొన్నూరులోని లాయర్లపై పోలీసులు అన్యాయంగా దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేశారు.

గుంటూరు జిల్లా: కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు. కోర్టు ప్రాంగణంలోని ప్రధాన గేట్లు మూసివేసి నిరసనకు దిగారు. కొద్ది రోజుల క్రితం పొన్నూరులోని లాయర్లపై పోలీసులు అన్యాయంగా దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేశారు. లాయర్లపై దాడికి పాల్పడిన సీఐ, ఎస్ఐతో పాటు కానిస్టేబుల్‌పై కేసు పెట్టి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 4, 5 రోజుల నుంచి గుంటూరు జిల్లా కోర్టు ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శుక్రవారం ఉదయం కోర్టు ప్రారంభ సమయంలో జిల్లా కోర్టు ప్రధాన గేట్లు మూసివేసి, తాళాలు వేసి లోపలకు ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

మార్కాపురంలో వైసీపీకి ఎదురుదెబ్బ..

గాయపడిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశి.. టీటీడీ కీలక నిర్ణయం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 10 , 2025 | 01:35 PM