కాంగ్రెస్దే గెలుపు.. తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్
ABN, Publish Date - Nov 11 , 2025 | 07:26 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు సాయంత్రం ముగిసింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ముందంజలో ఉందని ఎక్కువ శాతం సర్వేలు సూచిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ నివేదికలు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో బయటకు వచ్చాయి. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ అధికార కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని స్పష్టం చేశాయి.
ఇవి చూడండి
బీహార్, జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్..
Updated at - Nov 11 , 2025 | 07:46 PM