టిడ్కో ఇళ్లపై జగన్ నిర్లక్ష్యం.. సర్కార్‌పై భారం

ABN, Publish Date - Jan 03 , 2025 | 01:11 PM

అనంతపురం జిల్లా: ఏపీలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లల్లో సమస్యలు తిష్ట వేశాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత ప్రతిష్టాత్మకంగా టిడ్కో నిర్మాణాలు చేపట్టినా గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఈ ఇళ్లను పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టింది.

అనంతపురం జిల్లా: ఏపీలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లల్లో సమస్యలు తిష్ట వేశాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత ప్రతిష్టాత్మకంగా టిడ్కో నిర్మాణాలు చేపట్టినా గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఈ ఇళ్లను పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టింది. పెండింగ్‌నలో ఉన్న నిర్మాణాలను పట్టించుకోలేదు. పూర్తిగా ఇళ్లను గాలికి వదిలేయడంతో మరమత్తులకు నోచుకోలేదు. కానీ రుణాలు ఇచ్చిన బ్యాంకులు లబ్దిదారులను డిఫాల్టర్ జాబితాలో చేరుస్తున్నాయి. ఇంకా ఇళ్లే అప్పగించలేదు.. కానీ రుణం మాత్రం చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో టిడ్కో ఇళ్ల లబ్దిదారులు లబోదిబో మంటున్నారు.


ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏళ్లు గడిచినా సొంత ఇంటి కల నెరవేరలేదు. అంతలోనే బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ పాలనలో 50,914 ఇళ్లను మంజూరు చేయగా.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ వాటిని నిర్మించలేమని చేతులెత్తేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

రఘురామ కేసులో ట్విస్టు.. విచారణకు రాలేనంటూ..

మార్కాపురంలో స్కూల్ బస్సు బీభత్సం

ఒడిషా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు బాధ్యతలు

ఫార్ములా ఈ కార్ రేసు కేసు.. వారికి మళ్లీ ఈడీ పిలుపు

హైదరాబాద్‌కు వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 03 , 2025 | 01:22 PM