హైదరాబాదీలకు నీటి కష్టాలు.. ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్

ABN, First Publish Date - 2025-03-29T16:50:25+05:30 IST

Hyderabad Water Crisis: హైదరాబాద్ నగర వ్యాప్తంగా తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి.

హైదరాబాద్, మార్చి 29: రోజు రోజుకు ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. దీంతో హైదరాబాద్‌లో (Hyderabad) భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఈ కారణంగా జలమండలి సప్లై చేసే వాటర్ ట్యాంకర్లకు (Water Tankers) విపరీతంగా డిమాండ్ పెరిగింది. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి లాంటి ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. గడిచిన 75 రోజుల్లో రికార్డు స్థాయిలో 2 లక్షల 80 వేలకు పైగా వాటర్ ట్యాంకర్లు సప్లై చేసినట్లు వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. రానున్న రెండు నెలలు సిటీలో నీటి కొరత మరింత ఏర్పడే అవకాశం ఉండటంతో జలమండలి అధికారులు అలర్ట్ అయ్యారు.


ఇవి కూడా చదవండి

Palla Srinivas Speech: ఎన్టీఆర్ ఆశయాల సాధనకు చంద్రబాబు వెంటే నేనూ

Zodiac Signs: మీరు ఈ రాశిలో పుట్టారా మీకు బ్యాడ్ టైమ్ స్టార్ కాబోతుందని తెలుసా

Read Latest Telangana News And Telugu News

Updated at - 2025-03-29T16:52:15+05:30