పిన్నెల్లి అనుచరుడు అరెస్ట్
ABN, Publish Date - Jan 05 , 2025 | 09:53 PM
మాచర్ల మున్సిఫల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. టీడీపీ నాయకులు బొండా ఉమా, బుద్దా వెంకన్నలు పల్నాడులో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రయాణిస్తున్న కారుపై తురకా కిషోర్ దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నేతలతోపాటు ఆ కారులో ఉన్న న్యాయవాది సైతం తీవ్రంగా గాయపడ్డారు. అయితే అతడిపై కేసు నమోదు అయింది.
మాచర్ల మున్సిఫల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. టీడీపీ నాయకులు బొండా ఉమా, బుద్దా వెంకన్నలు పల్నాడులో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రయాణిస్తున్న కారుపై తురకా కిషోర్ దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నేతలతోపాటు ఆ కారులో ఉన్న న్యాయవాది సైతం తీవ్రంగా గాయపడ్డారు. అయితే అతడిపై కేసు నమోదు అయింది.
ఇక గత వైసీపీ ప్రభుత్వం అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తురకా కిషోర్ పరారీలో ఉన్నారు. టీడీపీ నేతలపై హత్యాయత్నానికి పాల్పడిన తురకా కిషోర్ను అరెస్ట్ చేయాలంటూ టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అందులోభాగంగా అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి.. పక్కా సమాచారంతో తురకా కిషోర్ను అరెస్ట్ చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 05 , 2025 | 09:53 PM