Share News

Ponguleti : త్వరలో 5 వేల మంది సర్వేయర్ల నియామకం

ABN , Publish Date - May 10 , 2025 | 04:24 AM

రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకుపోతున్న ప్రభుత్వం.. సర్వే విభాగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

Ponguleti : త్వరలో 5 వేల మంది సర్వేయర్ల నియామకం

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకుపోతున్న ప్రభుత్వం.. సర్వే విభాగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 వేల మంది లైసెన్స్‌ సర్వేయర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. సచివాలయంలో శుక్రవారం సర్వే విభాగంపై మంత్రి సమీక్ష నిర్వహించారు.


సర్వేయర్ల నియామకం కోసం మే 5వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైందని, ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తుకు చివరి గడువు అని చెప్పారు. మీ సేవ కేంద్రాల నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకొని అక్కడే సమర్పించాల్సి ఉంటుందన్నారు. లైసెన్స్‌ సర్వేయర్లకు 50 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులు శిక్షణ ఫీజు నిమిత్తం ఓసీలు రూ.10 వేలు, బీసీలు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

Updated Date - May 10 , 2025 | 04:24 AM