TG EAPCET: నేటి నుంచి ఎప్సెట్ దరఖాస్తులు షురూ..
ABN , Publish Date - Mar 01 , 2025 | 04:08 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీఎ్పసెట్-2005కు దరఖాస్తుల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభంకానుంది.
స్థానికేతర కోటాపై తొలగిన సందిగ్ధత
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీఎ్పసెట్-2005కు దరఖాస్తుల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభంకానుంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25 నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలు కావాల్సి ఉండగా.. స్థానికేతర కోటాపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే కన్వీనర్ కోటాలో మొత్తం సీట్లన్నీ స్థానికులకే కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం ఉదయం 10.30 గంటల నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎప్సెట్ నిర్వాహకులు తెలిపారు.