ఫోన్ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావుకు ఎదురుదెబ్బ
ABN , Publish Date - May 03 , 2025 | 05:06 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
తనను అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించారని, అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఉత్తర్వులు జారీ చేయాలంటూ ప్రభాకర్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జే శ్రీనివా్సరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్నఽ ధర్మాసనం.. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.