Sri Chaitanya Results: శ్రీచైతన్య విద్యార్థుల విజయభేరి
ABN , Publish Date - Jun 03 , 2025 | 06:03 AM
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు గర్వించదగ్గ ఫలితాలు సాధించాయి. వంగాల అజయ్రెడ్డి 300కి 300 మార్కులతో దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించారు. ఓపెన్ కేటగిరీలో జిద్దుసైన్ 3, ఉజ్వల్ కేసరి 5, అక్షత్ కుమార్ చౌరాసియా 6, అర్నవ్ నిగమ్ 11వ స్థానాల్లో నిలిచారు.
హైదరాబాద్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఆలిండియా మొదటి ర్యాంకుతో పాటు ఓపెన్ కేటగిరీలో 3, 5, 6, 11 ర్యాంకులు సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థల సీఈవో, అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. వంగాల అజయ్ రెడ్డి 300 మార్కులకు 300 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓపెన్ కేటగిరీలో ఎం.ఎ. జిద్దుసైన్ 3, ఉజ్వల్కేసరి 5, అక్షత్కుమార్ చౌరాసియా 6, అర్నవ్నిగమ్ 11, దేవ్దుత్త మజ్హీ 16, రుత్వికసాయి 18, వంగాల అజయ్రెడ్డి 19వ ర్యాంకు సొంతం చేసుకున్నట్లు తెలిపారు. ఓపెన్ కేటగిరీలో టాప్ 10లోపు మూడు ర్యాంక్లు, 20లోపు ఎనిమిది, 50లోపు 19 ర్యాంకులు, 100లోపు 29 ర్యాంకులను తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని వివరించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, అధ్యాపకులను అభినందించారు.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి