KTR and former minister Jagadish Reddy : కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలకు హైకోర్టులో ఊరట..
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:55 PM
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది.ఇరువురిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది.
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది.ఇరువురిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు కేటీఆర్, జగదీష్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే తమపై నమోదైన కేసును కొట్టేయాలని కేటీఆర్(KTR), జగదీష్ రెడ్డి(Jagadish Reddy)లు హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్ని నెలలుగా న్యాయస్థానంలో వాదనలు వినిపించారు ఇరువైపు న్యాయవాదులు. ఇరువైపులా వాదనలు ముగియడంతో గత నెల 11న తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఫేక్ వీడియోలపై ఎలాంటి ఆధారాలు లేవని తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.ఈ మేరకు ఇవాళ కేసును కొట్టివేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు భారీ ఉపశమనం లభించింది.
తాజాగా ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న కార్యలయంపై దాడి చేశారు. అయితే కొన్ని రోజులు వాడీవేడిగా నడిచిన దాడి ప్రస్తావన తరువాత ఎందుకో డీలా పడింది. అయితే కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ స్పందించిక పోవడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
కోవూరులో ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పాలంటూ మహిళల డిమాండ్