SFI: సైద్ధాంతిక భావజాలాన్ని పెంపొందించాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:50 AM
భారత విద్యార్థి ఫెడరేషన్(ఎ్సఎ్ఫఐ) కేవలం విద్యా సమస్యల పరిష్కారానికే పరిమితం కాకుండా సమాజంలో సైద్ధాంతిక భావజాలాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.
తరగతి గదిని సమాజంతో అనుసంధానించాలి
ఎస్ఎఫ్ఐ మహాసభల్లో నాగేశ్వర్
ఖమ్మం సంక్షేమ విభాగం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : భారత విద్యార్థి ఫెడరేషన్(ఎ్సఎ్ఫఐ) కేవలం విద్యా సమస్యల పరిష్కారానికే పరిమితం కాకుండా సమాజంలో సైద్ధాంతిక భావజాలాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఖమ్మం నగరంలో ఎస్ఎ్ఫఐ తెలంగాణ రాష్ట్ర ఐదో మహాసభల సందర్భంగా శనివారం ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సభలో నాగేశ్వర్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఏ సిద్ధాంతమైనా ఆచరణ నుంచి రావాలన్నారు. ఆచరణ కోసం అధ్యయనం చేయాలని సూచించారు. తరగతి గదిని సమాజంతో అనుసంధానం చేయాలని సూచించారు. దేశంలో పది శాతం ఉన్న కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం రూ.1.45 లక్షల కోట్ల రాయితీలు అందిస్తోందన్నారు.
అందువల్లనే విద్య, వైద్యం, సామాజిక రంగాలకు నిధుల కొరత ఏర్పడుతోందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని బీజేపీ సోషల్ మీడియా ముస్లిం దాడులుగా చిత్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. హార్స్ రైడర్ సయ్యద్ హుస్సేన్ పర్యాటకులను కాపాడిన విషయాన్ని సమాజం గుర్తుంచుకోవాలన్నారు. ఈ సభలో మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం పేరుతో 300 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతోందన్నారు. సభలో సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు, ఆహ్వాన సంఘం చైర్మన్ మువ్వా క్రాంతి శ్రీనివాసరావు ప్రసంగించారు. ఎస్ఎ్ఫఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలో పూర్వ నాయకులు ఖమ్మంలో విరాళాలు సేకరించారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News