High Court: రాష్ట్ర హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జిలు
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:44 AM
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది.
సుప్రీం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ
హైదరాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. సీనియర్ న్యాయాధికారులుగా పనిచేస్తున్న ఈ తిరుమలదేవి, రేణుక యార, నందికొండ నర్సింగ్రావు, బీఆర్ మధుసూధన్రావును హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి ఈనెల 11న సిఫారసు చేసింది.
దానికి తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ తిరుమలదేవి 2026 జూన్ 1 వరకు అదనపు జడ్జిగా వ్యవహరిస్తారు. మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులూ రెండేళ్లపాటు అదనపు జడ్జిలుగా కొనసాగనున్నారు. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. ఈ నలుగురు న్యాయమూర్తులు 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టులో మొత్తం 42 మంది న్యాయమూర్తులకు.. తాజా నియామకాలతో కలిపి ప్రస్తుతం 30కి సంఖ్య పెరిగింది.
ఇవి కూడా చదవండి..
BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్
Hyderabad: గ్రేటర్లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’