Share News

Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్..

ABN , Publish Date - Oct 11 , 2025 | 06:52 AM

ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. ఆజామాబాద్‌ ఐఇ, రామ్‌నగర్‌, అడిక్‌మెట్‌ 11 కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉదయం 10నుంచి 10.30 వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.

Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్..

- నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

హైదరాబాద్: ఆజామాబాద్‌(Azamabad) డివిజన్‌ పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. ఆజామాబాద్‌ ఐఇ, రామ్‌నగర్‌, అడిక్‌మెట్‌ 11 కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉదయం 10నుంచి 10.30 వరకు, విద్యానగర్‌ పరిధిలో 11నుంచి 11.30, అయ్యప్ప టెంపుల్‌ పరిధిలో 11నుంచి 12, పార్శిగుట్ట పరిధిలో 12నుంచి మధ్యాహం 1, ఇందిరానగర్‌ పరిధిలో 2నుంచి 2.30, 44 బస్టాప్‌ పరిధిలో 2.30నుంచి 3, హర్రాజ్‌పెంట పరిధిలో 3నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


చంపాపేట: చంపాపేట(Champapet) సెక్షన్‌ 11కేవీ సుల్తాన్‌వాల్వా విద్యుత్‌ ఫీడర్‌లో వివిధ మరమ్మతుల కారణంగా శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు డివిజన్‌ ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. కటికోనికుంట, ఓల్డ్‌చంపాపేట, సాయిరాంకాలనీ, సుల్తాన్‌వాల్వా, బస్తీ దవాఖానా, రాజిరెడ్డినగర్‌ కాలనీలలో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు. అదే విధంగా 11కేవీ కర్మన్‌ఘాట్‌, సాయిరాంనగర్‌ విద్యుత్‌ ఫీడర్లలో శనివారం ఉదయం 11:30 నుంచి 12గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు. ఆయా ఫీడర్ల పరిధిలోని గ్రీన్‌పార్కుకాలనీ, కర్మన్‌ఘాట్‌, సాయిరాంకాలనీ, నిర్మలానగర్‌, హనుమాన్‌నగర్‌, సాయిరాంనగర్‌ కాలనీలలో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు.


city1.2.jpg

రాజేంద్రనగర్‌: కాటేదాన్‌(Katedan) విద్యుత్‌ సెక్షన్‌ పరిధిలోని దుర్గానగర్‌ 11కేవీ ఫీడర్‌ పరిధిలో విద్యుత్‌ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. దుర్గానగర్‌, దుర్గాహిల్స్‌, టీఎన్‌జీవోస్‌ కాలనీ, అయ్యప్ప టెంపుల్‌, మైలార్‌దేవుపల్లి కల్లు కంపౌండ్‌, శాంతినగర్‌, గణేశ్‌నగర్‌, స్వప్న టాకీస్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు. కాటేదాన్‌ ఫీడర్‌ - 2 పరిధిలోని విశ్వకర్మ ఇంజనీరింగ్‌, భ్యాటరీ కంపెనీ, బసప్ప హోటల్‌ లేన్‌, హనుమాన్‌ టెంపుల్‌ ఏరియా, మినార్‌ హోటల్‌ ప్రాంతాల్లో ఉదయం 9గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2025 | 06:52 AM