Share News

సీఎం రేవంత్‌ను కలిసిన ఫౌల్ట్రీ ఉత్పత్తుల ప్రతినిధుల బృందం

ABN , Publish Date - Mar 03 , 2025 | 04:38 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని ఫౌల్ట్రీ ఉత్పత్తుల ప్రతినిధుల బృందం ఆదివారం కలిసింది.

సీఎం రేవంత్‌ను కలిసిన ఫౌల్ట్రీ ఉత్పత్తుల ప్రతినిధుల బృందం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని ఫౌల్ట్రీ ఉత్పత్తుల ప్రతినిధుల బృందం ఆదివారం కలిసింది. ఫౌలీ్ట్ర ఉత్పత్తులైన కోడిగుడ్లు, చికెన్‌ వినియోగంలో ఎలాంటి భయాలు లేవని, వాటిని ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ బృంద సభ్యులు సీఎంను కోరారు. బృందంలో తెలంగాణ ఫౌలీ్ట్ర బ్రీడర్స్‌ అసోసియేషన్‌ , తెలంగాణ ఫౌలీ్ట్ర ఫెడరేషన్‌ ప్రతినిధులు డా.జి.రంజిత్‌ రెడ్డి, కె.మోహన్‌ రెడ్డి, వి.భాస్కర్‌ రావు, జి.చంద్రశేఖర్‌ రెడ్డి, జి.రమేష్‌ బాబు, డి.రాంరెడ్డి, కె.జి.ఆనంద్‌, ఉదయ్‌ సింగ్‌ బయాస్‌, సంజీవ్‌ చింతవార్‌లు ఉన్నారు.

Updated Date - Mar 03 , 2025 | 04:38 AM