Share News

అరటి గెలల కింద గోవుల అక్రమ రవాణా

ABN , Publish Date - May 19 , 2025 | 04:45 AM

వాహనంలో పైన అరటి గెలలు.. కింద గోవులను ఉంచి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

అరటి గెలల కింద గోవుల అక్రమ రవాణా

  • భువనగిరి జిల్లా పంతంగి వద్ద పట్టివేత

  • పోలీసుల అదుపులో నిందితులు

చౌటుప్పల్‌ రూరల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): వాహనంలో పైన అరటి గెలలు.. కింద గోవులను ఉంచి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పిఠాపురం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా 28 గోవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద పట్టుకున్నారు.


నిందితులు రంగారెడ్డి జిల్లా మంతాల మండలం చెన్నారెడ్డి గూడేనికి చెందిన డీసీఎం డ్రైవర్‌ రమావత్‌ షరత్‌ కుమార్‌, క్లీనర్‌ దాసరి భగవాన్‌ను అరెస్టు చేసినట్లు చౌటుప్పల్‌ సీఐ మన్మథకుమార్‌ తెలిపారు. పట్టుకున్న ఆవులను హైదరాబాద్‌ గోశాలకు తరలించామని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన

Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత

For Telangana News And Telugu News

Updated Date - May 19 , 2025 | 04:45 AM