Share News

NIMS Professional BP Sahu : నిమ్స్‌ ప్రొఫెసర్‌ బీపీ సాహు కన్నుమూత

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:49 AM

నిమ్స్‌ సీనియర్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ బీ. ప్రసాద్‌ సాహు 67 అనారోగ్యంతో కన్నుమూశారు..

NIMS Professional BP Sahu : నిమ్స్‌ ప్రొఫెసర్‌ బీపీ సాహు కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌ సీనియర్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ బీ. ప్రసాద్‌ సాహు (67) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారు జామున మృతి చెందారు. నిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్‌గా చేరిన డాక్టర్‌ సాహు అడిషనల్‌ ప్రొఫెసర్‌గా, అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పలు పదోన్నతులు పొందారు. న్యూరో సర్జరీ విభాగానికి అధిపతిగా కూడా ఆయన సేవలు అందించారు. క్యాన్సర్‌ వ్యాధికి నిమ్స్‌లోనే చికిత్స పొందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

For More TG News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 02:49 AM