Share News

Telangana Budget 2025-26: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:22 AM

Telangana Budget 2025-26: తెలంగాణ శాసనసభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2025-26ను మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అంబేద్కర్‌ సూచనలను అనుసరిస్తూ ప్రజాపాలన చేస్తున్నామన్నారు. అధికారాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.

Telangana Budget 2025-26: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి
Minister Bhatti Vikramarka

హైదరాబాద్, మార్చి 19: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Minister Bhatti Vikramarka) తెలంగాణ శాసనసభలో (Telangana Assembly) ప్రవేశపెట్టారు. మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు భట్టి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా.. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాలల్లో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంతో సఫలీకృతమయ్యామన్నారు. అంబేద్కర్‌ సూచనలను అనుసరిస్తూ ప్రజాపాలన చేస్తున్నామన్నారు. అధికారాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.


గత పదేళ్లలో విధ్వంస పాలన సాగిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేస్తున్నారన్నారు. సొంత మీడియాలో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు. సమ్మిళిత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నామని మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


వరి బోనస్‌ కింద రూ.1,206 కోట్లు చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు రూ.12,511 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. త్వరలో 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని. విద్యావ్యవస్థ బలోపేతానికి యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీని తీసుకొస్తున్నామన్నారు. 58 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని.. కులమతాలతో సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్‌ సూళ్లలో బోధన ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఉండనున్నట్లు తెలిపారు. ప్రతి సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్‌ పథకం అమలులోకి తీసుకొస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల కోసం రూ.11,600 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి భట్టి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

KTR Criticizes Congress: ఇచ్చిన తేదీ దాటిపాయే... సన్నాలు ఏవీ సారూ

Big Shock To YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్.. మరో నేత జంప్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 19 , 2025 | 12:25 PM