Pakistani Fraud : పెళ్లి పేరుతో అమ్మాయిల మతం మార్చి హైదరాబాద్లో మోసాలకు పాల్పడుతున్న పాకిస్థాన్ యువకుడు ఫహద్
ABN , Publish Date - Aug 15 , 2025 | 08:52 AM
ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిల మతం మార్చి హైదరాబాద్లో మోసాలకు పాల్పడుతున్న పాకిస్థాన్ యువకుడు ఫహద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా ఫహద్.. కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
హైదరాబాద్, ఆగస్టు 15 : ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిల మతం మార్చి హైదరాబాద్లో మోసాలకు పాల్పడుతున్న పాకిస్థాన్ యువకుడు ఫహద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైటెక్ సిటీ దగ్గరున్న సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా పాకిస్థాన్ యువకుడు ఫహద్.. కీర్తి అనే అమ్మాయిని ప్రేమలోకి దింపాడు. హిందూ మతానికి చెందిన కీర్తిని.. దోహా ఫాతిమాగా పేరు, మతం మార్చి 2016 లో పెళ్లి చేసుకున్నాడు. అయితే, మరో యువతిని ప్రేమలోకి దింపే యత్నాల్లో తన భర్త ఉన్నాడని గ్రహించిన ఫాతిమా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో తన భర్త రాసలీలలు సాగిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న ఫాతిమా ఈ ఉదయం అక్కడికి వెళ్లింది. సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు పాకిస్థాన్ యువకుడు ఫహద్. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చి భర్తను మరో మహిళను పట్టించింది భార్య దోహా ఫాతిమా. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
కాగా, ఫహద్.. 1998లో పాకిస్థాన్ నుండి భారత్ వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. అమ్మాయిల మతం కన్వర్ట్ చేసి ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు ఫహద్ పూర్వాపరాలు సేకరిస్తున్నారు.